Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:34 PM

ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. ఎస్పీ ప్రశంసలు

ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. ఎస్పీ ప్రశంసలు

ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. ఎస్పీ ప్రశంసలు
March 11, 2026 11:28 AM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆటో డ్రైవర్ ఒకరు తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రయాణికులు ఆటోలో మర్చిపోయిన సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు.

వివరాల ప్రకారం విజయవాడకు చెందిన సుబ్బారావు కుటుంబంతో కలిసి ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా ఒక ఆటోలో ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే హడావుడిలో సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. కొంతసేపటి తర్వాత విషయం గుర్తించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ప్రయాణికులు దిగిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు తన వాహనంలో బ్యాగును గమనించారు. అది ప్రయాణికులదేనని భావించి వారిని వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నేరుగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బ్యాగును పోలీసులకు అప్పగించారు.

పోలీసులు బ్యాగును పరిశీలించగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సుబ్బారావుకు సమాచారం ఇచ్చి నగలను ఆయనకు అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు నిజాయితీని ప్రశంసిస్తూ సత్కరించారు. ఇదే తరహాలో మరో ఘటనలో ప్రయాణికులు మర్చిపోయిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్ ఖలీల్‌ను కూడా ఎస్పీ అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News