ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. ఎస్పీ ప్రశంసలు
ఒంగోలులో ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.30 లక్షల బంగారం అప్పగింత.. ఎస్పీ ప్రశంసలు
GADDAM JAGANMOHAN REDDY
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆటో డ్రైవర్ ఒకరు తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రయాణికులు ఆటోలో మర్చిపోయిన సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు.
వివరాల ప్రకారం విజయవాడకు చెందిన సుబ్బారావు కుటుంబంతో కలిసి ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా ఒక ఆటోలో ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే హడావుడిలో సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలు ఉన్న బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. కొంతసేపటి తర్వాత విషయం గుర్తించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక ప్రయాణికులు దిగిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు తన వాహనంలో బ్యాగును గమనించారు. అది ప్రయాణికులదేనని భావించి వారిని వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో నేరుగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగును పోలీసులకు అప్పగించారు.
పోలీసులు బ్యాగును పరిశీలించగా అందులో బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సుబ్బారావుకు సమాచారం ఇచ్చి నగలను ఆయనకు అప్పగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు నిజాయితీని ప్రశంసిస్తూ సత్కరించారు. ఇదే తరహాలో మరో ఘటనలో ప్రయాణికులు మర్చిపోయిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఆటో డ్రైవర్ ఖలీల్ను కూడా ఎస్పీ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి