PRINT TIME: March 14, 2026 09:24 AM
నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్
నూతన వధూవరులను ఆశీర్వదించిన వట్టె జానయ్య యాదవ్
March 12, 2026 04:05 PM
70 Views
స్థానికం ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud
సూర్యాపేట: పట్టణంలోని అనంత విజయ్ కార్యక్రమాల మందిరంలో గురువారం నిర్వహించిన వివాహ వేడుకలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యుడు వట్టె జానయ్య యాదవ్ పాల్గొన్నారు.బూర దశరథ్ గౌడ్, చంద్ర దంపతుల కుమార్తె తేజస్వీకి తులసి ఈశ్వర్తో జరిగిన వివాహ మహోత్సవంలో ఆయన హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఎషబోయిన మల్లేష్ యాదవ్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, బూర కిరణ్, వట్టె లింగరాజు, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి