Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 19, 2026 04:01 PM

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య

నూతన సంవత్సరానికి మార్గదర్శి పంచాంగం. డా. కూరెళ్ళ విఠలాచార్య
March 19, 2026 12:47 PM 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నిర్నముల గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణంలో పంచాంగ విడుదల

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నిర్నముల గ్రామంలో సాంప్రదాయ వైభవంగా శ్రీ పరాభవ నామ సంవత్సర జ్ఞాన గౌరి పంచాంగం ఆవిష్కరణ జరిగింది. సిద్ధాంత కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ బేతోజు సత్యనారాయణ శాస్త్రి గుణించిన సూర్యసిద్ధాంత ప్రామాణిక చాంద్రమాన పంచాంగాన్ని ఘనంగా విడుదల చేశారు.

పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. కూరెళ్ళ విఠలాచార్య ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించగా, గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శివరామాంజనేయాలయంలో జరిగిన ఈ వేడుకకు గ్రామ ప్రజలు, భక్తులు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంచాంగం భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, నూతన సంవత్సరానికి మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News