నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్కు టిజీవో నేతల శుభాకాంక్షలు
నూతన కలెక్టర్ ప్రతీక్ జైన్కు టిజీవో నేతల శుభాకాంక్షలు
Krishna
సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్ను టిజీవో సంగారెడ్డి జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, నోట్ పుస్తకాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసి సంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిజీవో జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి. వైద్యనాథ్, సెక్రటరీ డాక్టర్ ఎస్. సంతోష్ కుమార్, సహాధ్యక్షులు బలరాం, ఉపాధ్యక్షులు పర్వతాలు, ఐనేష్, లలిత కుమారి, రామాచారి, వెంకట్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు రాజిరెడ్డి, రవికుమార్, కార్యవర్గ సభ్యులు పుష్పలత, భూగర్భజలశాఖ ఉపసంచాలకులు డాక్టర్ జి. మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి