Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 14, 2026 09:21 AM

నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
March 12, 2026 04:05 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

పట్టణంలోని సీతారామ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన కంచర్ల వేణుగోపాల్ రెడ్డి కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, తెలంగాణ పర్యాటక సంస్థ అధ్యక్షుడు పటేల్ రమేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య పాల్గొన్నారు. వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారు సుఖశాంతులతో జీవించాలని ప్రముఖులు ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News