Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:04 PM

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు : మంత్రి కొలుసు పార్థసారథి
March 09, 2026 06:26 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, చెవి వినికిడి పరీక్ష యంత్రం, లాప్రోస్కోపీ యంత్రాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం సుమారు రూ.4 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

గత ప్రభుత్వం పేదల వైద్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శించిన మంత్రి, కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. గత ప్రభుత్వ కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదల వైద్యానికి ఒక్క రూపాయి కూడా అందలేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నూజివీడు నియోజకవర్గంలో సుమారు రూ.11 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించిందన్నారు.

పేదల వైద్యానికి రెండున్నర లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే సంజీవిని కార్డులు, టెలీ మెడిసిన్ సేవలను కూడా ప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు.

నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా సుమారు పది మండలాల ప్రజలకు సేవలు అందనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను నేటి నుంచి అందిస్తున్నామని తెలిపారు. అదనంగా సుమారు రూ.10 కోట్లతో నవజాత శిశు సంరక్షణ కేంద్రం కూడా మంజూరు అయినట్లు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్న మంత్రి, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News