నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించినఎమ్మెల్యే
నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించినఎమ్మెల్యే
Vaddeman Suresh
వలిగొండ స్థానికం ప్రతినిది:
:ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.వలిగొండ మండలం మాందాపురం గ్రామంలో ఎన్ ఆర్ ఈ జిఎస్ నిధుల కింద20 లక్షల రూపాయల వ్యయం, డిఎంఎఫ్ నిధుల కింద ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని బుధవారం భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెడ్డి గ్రామ సర్పంచ్ దంతూరు యాదమ్మ ఆంజనేయులు తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని మొత్తం 14 గ్రామాలలో పాటుగా వలిగొండ, మాందాపురం లో నిర్మించనున్న మహిళా సంఘం భవనాలకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు .అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. అనంతరం గ్రామపంచాయతీ భవనానికి స్థలం విరాళంగా ఇచ్చిన సోలిపురం చెన్న కృష్ణారెడ్డి, సోలిపురం ఉపేందర్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మాజీ జడ్పిటిసి కుసంగి రాములు, మాజీ సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి, బెలీదే నాగేశ్వర్ ఉలిపే మల్లేశం, పాలకూర్ల వెంకటేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి