నిరుపేదలకు న్యాయ సేవలు అందిస్తున్న జన్ను ఆనంద్కు అంబేద్కర్ అవార్డు
నిరుపేదలకు న్యాయ సేవలు అందిస్తున్న జన్ను ఆనంద్కు అంబేద్కర్ అవార్డు
Krishna
వరంగల్ జిల్లాలో ఆదివారం జన్ను ఆనంద్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆధ్వర్యంలో జన్ను ఆనంద్ను ఘనంగా సన్మానించి “జ్ఞాన సూర్యుడు అంబేద్కర్ అవార్డు” ప్రదానం చేశారు. గత కొన్నేళ్లుగా నిరుపేద కుటుంబాలకు ఉచిత న్యాయ సలహాలు, సూచనలు అందిస్తూ లీగల్ అడ్వైజర్గా సేవలు అందిస్తున్నందుకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జన్ను ఆనంద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బట్టి ఉచిత న్యాయ సేవలు, సలహాలు అందించడం కొనసాగిస్తానని తెలిపారు. డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ ఆయన సేవలను అభినందిస్తూ సమాజానికి చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మిట్టపల్లి రాజకుమార్, రాంబాబు, వేణుమాధవ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి