Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 12:51 PM

నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
May 01, 2026 09:04 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్ మండలం బోరంచ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గ్రామానికి చెందిన నిరుపేద మహిళ సాలె నాగమ్మకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన సమయంలో చేయూతనివ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. నిరుపేదల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ వారికి అన్నివేళలా అండగా నిలవడం జీఎంఆర్ ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోరంచ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మొట్లాకుంట నర్సన్న, పాలడుగు రామన్న, చాకలి సత్యయ్య, చాకలి మైపాల్, గొల్లపాపని గోపాల్, పుట్టి శివన్న, పుట్టి విట్టల్, బుక్క షాఫీ, చెట్టుకింది నర్సిములు, బలప్ప, రామప్ప, బుమప్ప తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News