నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
Krishna
మనూర్ మండలం బోరంచ గ్రామంలో నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ జీఎంఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గ్రామానికి చెందిన నిరుపేద మహిళ సాలె నాగమ్మకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన సమయంలో చేయూతనివ్వడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. నిరుపేదల కష్టసుఖాల్లో భాగస్వాములవుతూ వారికి అన్నివేళలా అండగా నిలవడం జీఎంఆర్ ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోరంచ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మొట్లాకుంట నర్సన్న, పాలడుగు రామన్న, చాకలి సత్యయ్య, చాకలి మైపాల్, గొల్లపాపని గోపాల్, పుట్టి శివన్న, పుట్టి విట్టల్, బుక్క షాఫీ, చెట్టుకింది నర్సిములు, బలప్ప, రామప్ప, బుమప్ప తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి