Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:38 PM

నిరుద్యోగ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి

నిరుద్యోగ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి

నిరుద్యోగ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి
March 14, 2026 09:02 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉద్యోగాల పట్టిక ప్రకటించి నియామక ప్రకటనలు ఇవ్వాలి: డి రవి

సూర్యాపేట,

ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయోగిస్తున్న ఆక్రమ నిర్బంధాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కోశాధికారి డి రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతూ ఉద్యోగాల పట్టిక ప్రకటించి నియామక ప్రకటనలు విడుదల చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాల పట్టిక ప్రకటించి నియామక ప్రకటనలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.

దేశ స్థాయి విధానానికి సమానంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో యువజన ప్రకటన విడుదల చేసి అధికారంలోకి వచ్చిన తరువాత దానిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో రెండు లక్షల వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ వాటికి అనుగుణంగా నియామక ప్రకటనలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.

గత ప్రభుత్వ కాలంలో ప్రకటించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిందే తప్ప కొత్తగా అదనపు ఉద్యోగాలను ప్రకటించలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ యువత సమస్యను గమనించి ఉద్యోగాల పట్టిక ప్రకటించి నియామక ప్రకటనలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ అంశంపై సమగ్రంగా చర్చించి యువతకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు, ఉద్యోగాల కోసం పోరాడుతున్న వారిపై పోలీసుల నిర్బంధాన్ని ఆపాలని సూచించారు. లేకపోతే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వీరబోయిన రమేష్, కోశాధికారి బండి రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News