నిరంతరం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
నిరంతరం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో జీఎంఆర్ ఫౌండేషన్ నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అవసరంలో ఉన్నవారిని గుర్తించి వారికి సహాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.సిర్గాపూర్ మండలం వంగ్ధల్ గ్రామానికి చెందిన శాంతమ్మ సర్వమణి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.అలాగే భవిష్యత్తులో కూడా అవసరం వచ్చినప్పుడు జీఎంఆర్ ఫౌండేషన్ ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని జీఎంఆర్ ఫౌండేషన్ పేర్కొంది.ఈ కార్యక్రమంలో కన్న పటేల్, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, పండరినాథ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి