Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

నిరంతరం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

నిరంతరం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

నిరంతరం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్
January 15, 2026 04:20 PM 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో జీఎంఆర్ ఫౌండేషన్ నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అవసరంలో ఉన్నవారిని గుర్తించి వారికి సహాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.సిర్గాపూర్ మండలం వంగ్ధల్ గ్రామానికి చెందిన శాంతమ్మ సర్వమణి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.అలాగే భవిష్యత్తులో కూడా అవసరం వచ్చినప్పుడు జీఎంఆర్ ఫౌండేషన్ ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని జీఎంఆర్ ఫౌండేషన్ పేర్కొంది.ఈ కార్యక్రమంలో కన్న పటేల్, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, పండరినాథ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News