Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:12 AM

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య
17-03-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

100 పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్ష

(సీపీఎం) ఆధ్వర్యంలో ప్రజలకు సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నిరంతరం ఉద్యమాలు, దశలవారీ పోరాటాలు కొనసాగుతున్నాయని సిపిఎం నాయకులు నీలం ఐలయ్య అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం అందకపోతే వారి పక్షాన నిలబడి సీపీఎం అనేక దఫాలు ఆందోళనలు చేపట్టింది.

దవాఖానలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సంతకాల సేకరణ, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మండలానికి వచ్చిన కలెక్టర్, వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించింది.

రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని సీపీఎం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ పాలకులు స్పందించకపోవడంతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం నాయకత్వం మరింత ఉధృతంగా పోరాటాన్ని కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన రూ.40 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 8 మంది సీపీఎం నాయకులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షలతో ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

ప్రజా వైద్య సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మండలంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని, రాజకీయ పక్షాలు కూడా స్పందించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పోరాడుతున్న ఈ ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Sthanikam

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య

Article Image

100 పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్ష

(సీపీఎం) ఆధ్వర్యంలో ప్రజలకు సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నిరంతరం ఉద్యమాలు, దశలవారీ పోరాటాలు కొనసాగుతున్నాయని సిపిఎం నాయకులు నీలం ఐలయ్య అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం అందకపోతే వారి పక్షాన నిలబడి సీపీఎం అనేక దఫాలు ఆందోళనలు చేపట్టింది.

దవాఖానలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సంతకాల సేకరణ, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మండలానికి వచ్చిన కలెక్టర్, వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించింది.

రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని సీపీఎం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ పాలకులు స్పందించకపోవడంతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం నాయకత్వం మరింత ఉధృతంగా పోరాటాన్ని కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన రూ.40 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 8 మంది సీపీఎం నాయకులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షలతో ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

ప్రజా వైద్య సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మండలంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని, రాజకీయ పక్షాలు కూడా స్పందించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పోరాడుతున్న ఈ ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News