Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 17, 2026 09:21 PM

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య
March 17, 2026 08:09 PM 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

100 పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్ష

(సీపీఎం) ఆధ్వర్యంలో ప్రజలకు సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నిరంతరం ఉద్యమాలు, దశలవారీ పోరాటాలు కొనసాగుతున్నాయని సిపిఎం నాయకులు నీలం ఐలయ్య అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం అందకపోతే వారి పక్షాన నిలబడి సీపీఎం అనేక దఫాలు ఆందోళనలు చేపట్టింది.

దవాఖానలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సంతకాల సేకరణ, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మండలానికి వచ్చిన కలెక్టర్, వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించింది.

రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని సీపీఎం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ పాలకులు స్పందించకపోవడంతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం నాయకత్వం మరింత ఉధృతంగా పోరాటాన్ని కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన రూ.40 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 8 మంది సీపీఎం నాయకులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షలతో ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

ప్రజా వైద్య సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మండలంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని, రాజకీయ పక్షాలు కూడా స్పందించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పోరాడుతున్న ఈ ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News