Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:13 AM

నిరవధిక నిరాహార దీక్షలకు పెరుగుతున్న ప్రజాదరణ.

నిరవధిక నిరాహార దీక్షలకు పెరుగుతున్న ప్రజాదరణ.

నిరవధిక నిరాహార దీక్షలకు పెరుగుతున్న ప్రజాదరణ.
March 17, 2026 07:35 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా నిరవధిక దీక్షలు విరమించేది లేదని ప్రాణాలు పోయినా దీక్ష కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జిల్లాల పెంటయ్య తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలోని చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరిన సందర్భంలో మండలంలోని వివిధ రంగాల సంస్థలు, ప్రజల నుండి ప్రజాదరణ పెరుగుతుందని అన్నారు. దీక్షలు రెండో రోజుకు చేరిన సందర్భంగా వివేకానంద డివైన్ మోడల్ స్కూల్, డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు, మండల పాత్రికేయులు,మండల మెడికల్ షాప్స్(కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్) మండల అసోసియేషన్ సభ్యులు, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, లాయర్స్ యూనియన్ అసోసియేషన్ నాయకులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ,పూల బండ్ల షాప్ల మహిళలు స్వచ్ఛందంగా నిరవధిక నిరాహార దీక్షలో శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఒకవైపు నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం ప్రజాపాలనలో ప్రజల కోసం పోరాటానికి మద్దతు తెలపకపోవడం విచారకరమని అన్నారు. వంద పడకల ఆస్పత్రి కొరకు ప్రజాప్రతినిధులు అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని లేని పక్షంలో రామన్నపేట మండల బందుకు పిలుపునిచ్చి వివిధ రంగాల ప్రజలను, మేధావులను,వివిధ రాజకీయ పార్టీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో దీక్ష సభ్యులు సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహ చారి, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, గొరిగె సోములు,వేముల సైదులు,శానగొండ రాము ఉన్నారు. మద్దతు తెలిపిన వారిలో వివేకానంద డివైన్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ తిరగడం మల్లికార్జున్,స్కూల్ యాజమాన్యం పిట్టల మత్స్యగిరి, మండల మెడికల్ షాప్స్ యజమాన్యం రాపోలు రమేష్,నరసింహ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఈర్లపల్లి మల్లయ్య మండల అధ్యక్షులు నోముల చిరంజీవి, లాయర్స్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మామిడి వెంకటరెడ్డి, పాల్వంచ జగతయ్య,పూల బండ్ల షాప్ మహిళలు శంకరమ్మ, లక్ష్మమ్మ తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని దీక్షలకు మద్దతు తెలిపారు


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News