యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్కు చెందిన మహేష్ తన మొబైల్ ఫోన్ను కొండపై బస్స్టాప్ వద్ద మరిచిపోయాడు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది శేఖర్ ఆ ఫోన్ను గుర్తించి, మైక్ ద్వారా ప్రకటన చేయించి భక్తుని వివరాలు సేకరించారు. అనంతరం మొబైల్ ఫోన్ను మహేష్కు సురక్షితంగా అప్పగించారు.
తన మొబైల్ తిరిగి లభించడంతో భక్తుడు ఆనందం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది శేఖర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఎస్వీఎఫ్ సిబ్బంది, సహచరులు, భక్తులు శేఖర్ నిజాయితీని అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి