Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:43 AM

నిజాయితీకి నిలువునా అన్యాయం

నిజాయితీకి నిలువునా అన్యాయం

నిజాయితీకి నిలువునా అన్యాయం
08-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కర్రీ శివ సుబ్బారావు దంపతుల కన్నీటి పర్యంతం

స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామన్న వార్డు ప్రజలు

కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడితే, కనీస గుర్తింపు లేకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి తమను అవమానించారని 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కర్రీ శివ సుబ్బారావు దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సిపిఐ సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్ అరాచక పాలనలో అనేక ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ జెండాను వీడకుండా నిలబడిన తమకు, నేడు పార్టీ పెద్దలు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఏ సంబంధం లేని వ్యక్తికి గంటల వ్యవధిలో టికెట్ ఇచ్చి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వాపోయారు. అయితే, వార్డు ప్రజలు మాత్రం మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. నిస్వార్థంగా సేవ చేసిన శివ సుబ్బారావును స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానించి మానవత్వాన్ని చాటుకున్నారు.కార్యకర్తల మనోభావాలను గౌరవించని పాలకులకు ఓటుతో బుద్ధి చెబుతామని, శివ సుబ్బారావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. కన్నీటి పర్యాంతం అవుతున్న శివ సుబ్బారావు దంపతులను వార్డు ప్రజలు ఓదార్చారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డి, గరినే కోటేశ్వరరావు, దానాల వెంకయ్య, కంబాల రంగ, శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, అఖిలేష్ రెడ్డి, బండారు భాస్కర్, శివ తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

నిజాయితీకి నిలువునా అన్యాయం

Article Image

కర్రీ శివ సుబ్బారావు దంపతుల కన్నీటి పర్యంతం

స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామన్న వార్డు ప్రజలు

కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడితే, కనీస గుర్తింపు లేకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి తమను అవమానించారని 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కర్రీ శివ సుబ్బారావు దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సిపిఐ సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్ అరాచక పాలనలో అనేక ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ జెండాను వీడకుండా నిలబడిన తమకు, నేడు పార్టీ పెద్దలు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఏ సంబంధం లేని వ్యక్తికి గంటల వ్యవధిలో టికెట్ ఇచ్చి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వాపోయారు. అయితే, వార్డు ప్రజలు మాత్రం మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. నిస్వార్థంగా సేవ చేసిన శివ సుబ్బారావును స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానించి మానవత్వాన్ని చాటుకున్నారు.కార్యకర్తల మనోభావాలను గౌరవించని పాలకులకు ఓటుతో బుద్ధి చెబుతామని, శివ సుబ్బారావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. కన్నీటి పర్యాంతం అవుతున్న శివ సుబ్బారావు దంపతులను వార్డు ప్రజలు ఓదార్చారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డి, గరినే కోటేశ్వరరావు, దానాల వెంకయ్య, కంబాల రంగ, శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, అఖిలేష్ రెడ్డి, బండారు భాస్కర్, శివ తదితరులు పాల్గొన్నారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News