Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

నిజాయితీకి నిలువునా అన్యాయం

నిజాయితీకి నిలువునా అన్యాయం

నిజాయితీకి నిలువునా అన్యాయం
February 08, 2026 11:50 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కర్రీ శివ సుబ్బారావు దంపతుల కన్నీటి పర్యంతం

స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామన్న వార్డు ప్రజలు

కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడితే, కనీస గుర్తింపు లేకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి తమను అవమానించారని 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కర్రీ శివ సుబ్బారావు దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సిపిఐ సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్ అరాచక పాలనలో అనేక ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ జెండాను వీడకుండా నిలబడిన తమకు, నేడు పార్టీ పెద్దలు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఏ సంబంధం లేని వ్యక్తికి గంటల వ్యవధిలో టికెట్ ఇచ్చి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వాపోయారు. అయితే, వార్డు ప్రజలు మాత్రం మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. నిస్వార్థంగా సేవ చేసిన శివ సుబ్బారావును స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానించి మానవత్వాన్ని చాటుకున్నారు.కార్యకర్తల మనోభావాలను గౌరవించని పాలకులకు ఓటుతో బుద్ధి చెబుతామని, శివ సుబ్బారావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. కన్నీటి పర్యాంతం అవుతున్న శివ సుబ్బారావు దంపతులను వార్డు ప్రజలు ఓదార్చారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డి, గరినే కోటేశ్వరరావు, దానాల వెంకయ్య, కంబాల రంగ, శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, అఖిలేష్ రెడ్డి, బండారు భాస్కర్, శివ తదితరులు పాల్గొన్నారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News