Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామస్థుల సమిష్టి కృషి అవసరం: ఎస్సై కోటేశ్వరరావు కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 08:05 PM

నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభం

నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభం

నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభం
April 13, 2026 06:08 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

- సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు రావాలి.

- ప్రజల రక్షణలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది.

- నేరాల నివారణలో ప్రజలు భాగస్వామి కావాలి.

పట్టణంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా ప్రారంభించారు. మొత్తం 75 సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నివారణ, నియంత్రణ, చేదనలో సీసీ కెమెరాల ప్రాధాన్యత ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి కెమెరా వందమంది పోలీసులకు సమానంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

పట్టణంలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతున్నామని, ప్రజలు, వ్యాపారులు ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నేరాల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని సూచించారు.పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షణ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేసి ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక పద్ధతులతో నేరాలను అరికట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, డిఎస్పి ప్రసన్నకుమార్, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News