నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభం
నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభం
Biksham
- సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు రావాలి.
- ప్రజల రక్షణలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది.
- నేరాల నివారణలో ప్రజలు భాగస్వామి కావాలి.
పట్టణంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా ప్రారంభించారు. మొత్తం 75 సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నివారణ, నియంత్రణ, చేదనలో సీసీ కెమెరాల ప్రాధాన్యత ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి కెమెరా వందమంది పోలీసులకు సమానంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.
పట్టణంలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతున్నామని, ప్రజలు, వ్యాపారులు ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నేరాల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని సూచించారు.పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షణ చేయడానికి పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేసి ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక పద్ధతులతో నేరాలను అరికట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, డిఎస్పి ప్రసన్నకుమార్, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి