Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:59 AM

నిదానపల్లిలో హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం

నిదానపల్లిలో హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం

నిదానపల్లిలో హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం
27-03-2026 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్థులు, భక్తుల సమక్షంలో ఈ వేడుకలను వైభవంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చైత్రమాస శుద్ధ నవమి సందర్భంగా ఉదయం 11:55 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం జరగనుందని ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా నిదానపల్లి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని భక్తబృందం కోరారు.


Sthanikam

నిదానపల్లిలో హనుమాన్ ఆలయంలో సీతారాముల కళ్యాణం

Article Image

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా గ్రామస్థులు, భక్తుల సమక్షంలో ఈ వేడుకలను వైభవంగా జరపడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

చైత్రమాస శుద్ధ నవమి సందర్భంగా ఉదయం 11:55 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం జరగనుందని ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా నిదానపల్లి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని భక్తబృందం కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News