Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండవ భద్రాద్రిగా రామగిరి రామాలయం అభివృద్ధి శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రామనవమి వేడుకలు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 27, 2026 07:23 PM

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా  శ్రీ సీతారాముల కళ్యాణం
March 27, 2026 05:02 PM 152 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తుల కోలాహలం మధ్య దివ్య కల్యాణం

ఊరేగింపుగా స్వామివారికి ఘన స్వాగతం, ప్రత్యేక పూజలు, అన్నదానం

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఐదోసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారిని గ్రామపంచాయతీ నుండి హనుమాన్ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. పల్లకికి బిందెలతో నీళ్లు పోస్తూ భక్తి శ్రద్ధలతో ఆహ్వానించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కళకళలాడింది.

చైత్రమాస శుద్ధ నవమి సందర్భంగా ఉదయం 11:55 గంటలకు అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. తలంబ్రాలు, మంగళసూత్రధారణ వంటి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించగా భక్తులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య, కొండ అశోక్ గౌడ్–అనూష, చల్ల శ్రీశైలం–మమత, నాగభూషణం–పద్మ, బబ్బూరి నర్సయ్య -నాగమణి, కొండ శంకరయ్య- పుష్పమ్మ, కడారి భాగ్య- రవి,దంపతులు కళ్యాణం కళ్యాణం మీద కూర్చున్నారు. యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.

అలాగే ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదం అందజేశారు. గ్రామంలోని భక్తులు, యువకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మొత్తం కార్యక్రమం భక్తి పరవశంలో సాగి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News