Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 11:47 PM

నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం

నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం

నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం
February 23, 2026 07:35 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్‌కు చెక్ – ఎస్పీ నితిక పంత్ హెచ్చరిక

కొమరం భీమ్ ఆసిఫాబాద్ : జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారిపై ఇకపై ఉక్కుపాదం మోపనున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ స్పష్టం చేశారు. త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మైనర్లు వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపైనా కేసు నమోదు చేస్తామని తెలిపారు. బాధ్యతారాహిత్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశముందని, ఆ ప్రమాదాలు కుటుంబాలనే కాకుండా ఇతర నిరపరాధుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు.

నంబర్ ప్లేట్లలో అక్రమాలకు కఠిన చర్యలు

లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, నంబర్ ప్లేట్ లేకుండా లేదా తప్పుడు నంబర్లతో వాహనాలు నడపడం, ఫ్యాన్సీ డిజైన్లతో నంబర్లు గుర్తించలేని విధంగా ఏర్పాటు చేయడం వంటి చర్యలను సహించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. అన్ని వాహన యజమానులు నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అలాగే శబ్ద కాలుష్యానికి కారణమయ్యే విధంగా మార్పులు చేసిన సైలెన్సర్లతో ద్విచక్ర వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

రోడ్డు భద్రతపై అప్రమత్తత అవసరం

మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, రాంగ్ సైడ్ పార్కింగ్, ఓవర్ లోడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.

ప్రజల ప్రాణభద్రత కోసం జిల్లా వ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ నితిక పంత్ పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News