నీట్-యూజీ 2026 పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
నీట్-యూజీ 2026 పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Krishna
నీట్-యూజీ 2026 పరీక్షలు ప్రశాంతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తారా డిగ్రీ కాలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల–పోతిరెడ్డిపల్లి, కేంద్రీయ విద్యాలయం (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) పరీక్ష కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించబడనున్న నేపథ్యంలో పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు తెరవడానికి అనుమతి ఉండదని తెలిపారు. అలాగే సెక్షన్ 163 బి.యన్.యస్.ఎస్ అమల్లో ఉంటుందని, పరీక్ష కేంద్రాల వద్ద గుంపులుగా తిరగడం నిషేధమని స్పష్టం చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి