Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేసీఆర్ శకం ముగిసింది: ఎంపీ అర్వింద్ క్షణిక కోరికల కోసం… శాశ్వత బంధాల పతనం! పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 10:10 PM

నీట్-యూజీ 2026 పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

నీట్-యూజీ 2026 పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు

నీట్-యూజీ 2026 పరీక్షలకు సంగారెడ్డి జిల్లాలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
May 03, 2026 08:54 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నీట్-యూజీ 2026 పరీక్షలు ప్రశాంతంగా మరియు పారదర్శకంగా నిర్వహించేందుకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తారా డిగ్రీ కాలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల–పోతిరెడ్డిపల్లి, కేంద్రీయ విద్యాలయం (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ) పరీక్ష కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించబడనున్న నేపథ్యంలో పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు తెరవడానికి అనుమతి ఉండదని తెలిపారు. అలాగే సెక్షన్ 163 బి.యన్.యస్.ఎస్ అమల్లో ఉంటుందని, పరీక్ష కేంద్రాల వద్ద గుంపులుగా తిరగడం నిషేధమని స్పష్టం చేశారు. అన్ని పరీక్ష కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News