నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని డీవైఎఫ్ఐ.
నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి. ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని డీవైఎఫ్ఐ.
Editor Desk
నకిరేకల్
నీట్ పరీక్ష నిర్వహణలో వరుసగా జరుగుతున్న పేపర్ లీక్ ఘటనలపై డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నకిరేకల్లో నిర్వహించిన డీవైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు రాసే నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగడం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఎన్నో కష్టాలు పడి పరీక్షలకు సిద్ధమవుతుంటే ఎన్టీఏ నిర్లక్ష్యం వారి భవిష్యత్తును దెబ్బతీస్తోందన్నారు. వరుస వైఫల్యాలకు కారణమైన ఎన్టీఏను వెంటనే రద్దు చేసి పారదర్శకమైన కొత్త పరీక్షా విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో బొడ్డుపల్లి నరేష్, కన్నెబోయిన వీరేష్, అదిమల్ల జ్యోతిబసు, భగత్ చరణ్, కందుకూరి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి