నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్యమానికి బలమైన తోడ్పాటు – రాష్ట్ర కమిటీలో మోహన్కు స్థానం
నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్యమానికి బలమైన తోడ్పాటు – రాష్ట్ర కమిటీలో మోహన్కు స్థానం
Sthanikam District Staff Reporter krishna
నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన ముఖ్య సమావేశంలో రాష్ట్ర కమిటీ మెంబర్గా ధనావత్ మోహన్కు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలానికి చెందిన ధనావత్ మోహన్ ను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ,సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మరియు సాధారణ ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే వాటిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా రాష్ట్ర కమిటీ సభ్యులు చురుకుగా పని చేయాలని సూచించారు.తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మోహన్ మాట్లాడుతూ, సంస్థ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వినోద్ కుమార్తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగి, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి