నేషనల్ హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బైండ్ల కృష్ణ ,జిల్లా ప్రధాన కార్యదర్శిగా అఖిల్ నియామక
నేషనల్ హ్యూమన్ రైట్స్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బైండ్ల కృష్ణ ,జిల్లా ప్రధాన కార్యదర్శిగా అఖిల్ నియామక
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జిల్లా ఆఫీస్ కార్యాలయంలో శనివారం ఒక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ పాల్గొని నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామానికి చెందిన బైండ్ల కృష్ణ ను సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా,నారాయణఖేడ్ మండలం పరిధిలో మన్సూర్ పూర్ గ్రామానికి చెందిన అఖిల్ ను సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని
నియామక ఉత్తర్వులు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ మాట్లాడుతూ... జిల్లాలో ప్రతి మండలాల్లో గ్రామాల్లో లోని విద్య,వైద్యం,ఆరోగ్యం,
న్యాయం,రెవెన్యూ,రైతు,మహిళ సమస్యలపైన స్పందించి వారి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని,విద్యార్థులకు ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు.నూతనంగా నియమకమైన నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ,జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ మాట్లాడుతూ..మాకు ఈ అవకాశం ఇచ్చిన నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలం పరిధిలో మహిళ, ప్రజల,రైతుల, విద్యార్థుల, రెవెన్యూ, సమస్యల పైన పోరాడుతు నా వంతు కర్తవ్యంగా,బాధ్యతాయుతంగా,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ అఫ్ ఇండియా నియమాలను ఎల్లప్పుడూ నడుచుకుంటానని , నడుచుకొని సేవా దృక్పథంతో ముందుకు వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి