Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:37 AM

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్
26-02-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రోమ్ నగరం అగ్నికి ఆహుతవుతుంటే నీరో చక్రవర్తి వీణ వాయించాడన్న చరిత్రను ఉదాహరణగా చూపుతూ, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో అతిసారాతో, రాజమహేంద్రవరం నగరంలో నకిలీ పాలు కారణంగా మరణాలు సంభవిస్తుంటే బాధిత కుటుంబాలను పరామర్శించి, వైద్య సహాయం, ఆర్థిక సాయం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమవడం సరికాదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణ భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పాలకవర్గం ప్రజా సమస్యలపై స్పష్టమైన చర్యలు ప్రకటించాలని డి. హరినాథ్ కోరారు.

“తాగే నీటిలో కల్తీ, పాలలో కల్తీ… రాష్ట్రవ్యాప్తంగా నిర్లక్ష్యం పెరిగితే మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ ప్రభుత్వం వద్ద డిమాండ్ చేసింది.

Sthanikam

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్

Article Image

రోమ్ నగరం అగ్నికి ఆహుతవుతుంటే నీరో చక్రవర్తి వీణ వాయించాడన్న చరిత్రను ఉదాహరణగా చూపుతూ, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో అతిసారాతో, రాజమహేంద్రవరం నగరంలో నకిలీ పాలు కారణంగా మరణాలు సంభవిస్తుంటే బాధిత కుటుంబాలను పరామర్శించి, వైద్య సహాయం, ఆర్థిక సాయం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమవడం సరికాదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణ భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పాలకవర్గం ప్రజా సమస్యలపై స్పష్టమైన చర్యలు ప్రకటించాలని డి. హరినాథ్ కోరారు.

“తాగే నీటిలో కల్తీ, పాలలో కల్తీ… రాష్ట్రవ్యాప్తంగా నిర్లక్ష్యం పెరిగితే మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ ప్రభుత్వం వద్ద డిమాండ్ చేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News