Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 03:00 AM

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్
February 26, 2026 08:06 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రోమ్ నగరం అగ్నికి ఆహుతవుతుంటే నీరో చక్రవర్తి వీణ వాయించాడన్న చరిత్రను ఉదాహరణగా చూపుతూ, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో అతిసారాతో, రాజమహేంద్రవరం నగరంలో నకిలీ పాలు కారణంగా మరణాలు సంభవిస్తుంటే బాధిత కుటుంబాలను పరామర్శించి, వైద్య సహాయం, ఆర్థిక సాయం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమవడం సరికాదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణ భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పాలకవర్గం ప్రజా సమస్యలపై స్పష్టమైన చర్యలు ప్రకటించాలని డి. హరినాథ్ కోరారు.

“తాగే నీటిలో కల్తీ, పాలలో కల్తీ… రాష్ట్రవ్యాప్తంగా నిర్లక్ష్యం పెరిగితే మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ ప్రభుత్వం వద్ద డిమాండ్ చేసింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News