Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

నేరేడ్మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ, 18 నెలల వయసు గల చిన్నారి అదృశ్యం

నేరేడ్మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ, 18 నెలల వయసు గల చిన్నారి అదృశ్యం

నేరేడ్మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ, 18 నెలల వయసు గల  చిన్నారి అదృశ్యం
February 01, 2026 09:11 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar



నాలుగు నెలల గర్భవతి అయిన కుమార్తె కోసం తల్లిదండ్రుల ఆవేదన

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళతో పాటు 19 నెలల వయసుగల చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.

ఈ ఘటనకు సంబంధించి ఆమె తల్లి పోలీసులకుఫిర్యాదుచేసింది.వివరాల్లోకి వెళ్తేనేరేడ్మెట్ వివేకానందపురానికి చెందిన పావళూరు రేణుక (47) తన కుమార్తె పావళూరు ఆర్తి (21) మరియు మనవరాలు చైత్రిక (19 నెలలు) కనిపించడం లేదంటూ నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్తి సాయినాథపురం లో నివాసం ఉంటోంది.

ఆర్తి ప్రకాశ్ అనే యువకుడి తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి చైత్రిక అనే 19 నెలల ఆడబిడ్డ ఉంది. ప్రస్తుతం ఆర్తి నాలుగు నెలల గర్భవతి కావడం గమనార్హం.జనవరి 31వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భర్తతో గొడవ జరిగిన అనంతరం ఆర్తి తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఆ సమయంలో తల్లి రేణుక ఇంట్లో లేకపోవడంతో తాను తిరిగి భర్త ఇంటికి వెళ్లిపోతానని ఆర్తి చెప్పినట్లు ఫిర్యాదులో ఆమె తల్లి పేర్కొన్నారు.

అయితే, ఆ తర్వాత ఆర్తి భర్త ఇంటికి తిరిగి చేరుకోలేదని, ఆమెతో పాటు చిన్నారి చైత్రిక కూడా కనిపించడంలేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన అన్ని చోట్లా వెతికినప్పటికీ ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చివరకు నేరేడ్మెట్ పోలీసులను ఆశ్రయించారు.బాధితుల ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు మహిళ మరియు బాలిక మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.నాలుగు నెలల గర్భవతి అయిన కుమార్తెతో పాటు చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News