నీర్నెంలలో ఘనంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ
నీర్నెంలలో ఘనంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ
Editor Desk
సమాజ సేవే ధ్యేయం – వ్యవస్థాపకుడు గోపి దోమలపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం లోని నీర్నెంల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రముఖులు, ఫౌండేషన్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపి దోమలపల్లి మాట్లాడుతూ… సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలవడం, గ్రామీణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు. యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ బాధ్యతాయుత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
గ్రామీణాభివృద్ధి, పేద విద్యార్థులకు విద్యా సహాయం, పర్యావరణ పరిరక్షణ, సమాజంలో అక్రమాలపై పోరాటం వంటి అంశాలను ఫౌండేషన్ ముఖ్యంగా చేపడుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, హనుమాన్ యువజన సంఘం ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఫౌండేషన్ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు వివరించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి