నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. ఎస్పీ
నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం.. ఎస్పీ
Harish K
అలవాటుగా నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం,జిల్లా భహిష్కరణకు చర్యలు తీసుకుంటాం అని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు.మంగళవారం కోదాడ పట్టణంలోని కాశీనాదం పంక్షన్ హల్ నందు కోదాడ డివిజన్ స్థాయి పాత నేరస్థులకు,గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు,సస్పెక్ట్ షీటర్స్ కు నిర్వహించ పరివర్తన,సత్ప్రవర్తన అవగాహన కార్యక్రమం నందు పాల్గొని అవగాహన కల్పించారు. నేరాలకు పాల్పడితే సమాజంలో వ్యక్తిగత గౌరవం తగ్గుతుంది, క్షణికావేశంతో నేరాలకు, దాడులకు పాల్పడితే భవిష్యత్తులో సమస్యలు తప్పవు, నేరానికి పాల్పడితే ఏనాటికైనా చట్టపరమైన కఠిన శిక్షలు పడతాయని తెలిపారు. చిన్న చిన్న తప్పులు, నేరాలు చేసి జైలు పాలవకుండా జీవితాన్ని ఆస్వాదించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని తెలిపారు. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో మెలగాలి అని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి