Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 06:34 AM

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు
February 25, 2026 08:41 PM 324 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన ఓ యువకుడు గత నెలరోజులుగా అదృశ్యమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన సూర దామోదర్ (33) అనే వ్యక్తి రాత్రి సమయంలో ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఇప్పటివరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, దామోదర్‌కు గత ఐదు నెలలుగా మానసిక సమస్యలు ఉండటంతో హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పుడప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయే అలవాటు ఉన్నప్పటికీ, ఇంతకాలం పాటు తిరిగి రాకపోవడం ఇదే మొదటిసారిగా జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.అతని వద్ద ఎటువంటి మొబైల్ ఫోన్ కూడా లేదని, బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దామోదర్ ఎత్తు సుమారు 6 అడుగులు 1 అంగుళం ఉండి, తెలుపు వర్ణంతో ఉంటాడని తెలిపారు.ఈ మేరకు అతని తమ్ముడు సూర శేఖర్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News