Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 11:57 PM

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు
February 25, 2026 08:41 PM 330 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన ఓ యువకుడు గత నెలరోజులుగా అదృశ్యమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన సూర దామోదర్ (33) అనే వ్యక్తి రాత్రి సమయంలో ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఇప్పటివరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, దామోదర్‌కు గత ఐదు నెలలుగా మానసిక సమస్యలు ఉండటంతో హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పుడప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయే అలవాటు ఉన్నప్పటికీ, ఇంతకాలం పాటు తిరిగి రాకపోవడం ఇదే మొదటిసారిగా జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.అతని వద్ద ఎటువంటి మొబైల్ ఫోన్ కూడా లేదని, బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దామోదర్ ఎత్తు సుమారు 6 అడుగులు 1 అంగుళం ఉండి, తెలుపు వర్ణంతో ఉంటాడని తెలిపారు.ఈ మేరకు అతని తమ్ముడు సూర శేఖర్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News