నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు
నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు
K.RAVI
మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన ఓ యువకుడు గత నెలరోజులుగా అదృశ్యమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన సూర దామోదర్ (33) అనే వ్యక్తి రాత్రి సమయంలో ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఇప్పటివరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, దామోదర్కు గత ఐదు నెలలుగా మానసిక సమస్యలు ఉండటంతో హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పుడప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయే అలవాటు ఉన్నప్పటికీ, ఇంతకాలం పాటు తిరిగి రాకపోవడం ఇదే మొదటిసారిగా జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.అతని వద్ద ఎటువంటి మొబైల్ ఫోన్ కూడా లేదని, బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దామోదర్ ఎత్తు సుమారు 6 అడుగులు 1 అంగుళం ఉండి, తెలుపు వర్ణంతో ఉంటాడని తెలిపారు.ఈ మేరకు అతని తమ్ముడు సూర శేఖర్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి