నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన అధికారులు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు: ఆర్ఐ శోభ
నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన అధికారులు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు: ఆర్ఐ శోభ
Editor Desk
రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు నేలమట్టమైన ఇండ్ల ఘటనపై అధికారులు స్పందించారు. గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను రామన్నపేట ఆర్ఐ శోభ బుధవారం పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.
మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు గ్రామానికి చెందిన ఉయ్యాల యాదమ్మ, జట్టి వెంకన్న, పొనుగోటి రజిత, ఏనుగు మాధవరెడ్డి తదితరుల ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నివాసాలు కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉండగా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించారు.
ఇండ్ల నష్టాన్ని పరిశీలించిన ఆర్ఐ శోభ మాట్లాడుతూ.. బాధితుల వివరాలను ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, జీపీవో నరసింహ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి