Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 02:21 PM

నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన అధికారులు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు: ఆర్ఐ శోభ

నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన అధికారులు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు: ఆర్ఐ శోభ

నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన అధికారులు.  బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు: ఆర్ఐ శోభ
27-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు నేలమట్టమైన ఇండ్ల ఘటనపై అధికారులు స్పందించారు. గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను రామన్నపేట ఆర్ఐ శోభ బుధవారం పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.

మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు గ్రామానికి చెందిన ఉయ్యాల యాదమ్మ, జట్టి వెంకన్న, పొనుగోటి రజిత, ఏనుగు మాధవరెడ్డి తదితరుల ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నివాసాలు కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉండగా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించారు.

ఇండ్ల నష్టాన్ని పరిశీలించిన ఆర్ఐ శోభ మాట్లాడుతూ.. బాధితుల వివరాలను ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, జీపీవో నరసింహ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన అధికారులు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు: ఆర్ఐ శోభ

Article Image

రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు నేలమట్టమైన ఇండ్ల ఘటనపై అధికారులు స్పందించారు. గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను రామన్నపేట ఆర్ఐ శోభ బుధవారం పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.

మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు గ్రామానికి చెందిన ఉయ్యాల యాదమ్మ, జట్టి వెంకన్న, పొనుగోటి రజిత, ఏనుగు మాధవరెడ్డి తదితరుల ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నివాసాలు కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉండగా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించారు.

ఇండ్ల నష్టాన్ని పరిశీలించిన ఆర్ఐ శోభ మాట్లాడుతూ.. బాధితుల వివరాలను ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, జీపీవో నరసింహ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News