నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. ఏఈ ఎం. కోటేశ్వరరావు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం. ఏఈ ఎం. కోటేశ్వరరావు
ఎడిటోరియల్ టీమ్
రామన్నపేట మండలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నూతన లైన్ ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో నేడు (ఆదివారం) పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
తుమ్మలగూడెం సబ్స్టేషన్ పరిధిలోని తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం గ్రామాలతో పాటు లక్ష్మాపురం సబ్స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాల్లో సింగిల్ ఫేజ్ మరియు త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.
అలాగే రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్ నుంచి సిరిపురం వెళ్లే రహదారి వరకు (ప్రభుత్వ ఆసుపత్రి గోడవైపు నుంచి సిరిపురం రోడ్ వరకు) విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుంది.
ఈ విద్యుత్ నిలిపివేత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
కాబట్టి వినియోగదారులు అసౌకర్యానికి క్షమించవలసిందిగా, విద్యుత్ శాఖ పనులకు సహకరించవలసిందిగా ఏఈ ఎం. కోటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి