Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:36 PM

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం
May 19, 2026 03:46 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. గర్భవతిని చేసి అబార్షన్ ఆరోపణలు

ఖమ్మం, : భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను న్యాయం చేస్తానంటూ నమ్మించిన సీఐ ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పనిచేసిన బానోత్ రాజు నాయక్‌పై కేసు నమోదు చేశారు. భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కరిస్తానంటూ ఆమెకు దగ్గరైన సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో మహిళ గర్భవతి కావడంతో పెళ్లి గురించి ప్రశ్నించగా, బలవంతంగా మాత్రలు మింగించి అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నెల 7న బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ రాజు నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.

ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News