న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం
న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం
Editor Desk
ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. గర్భవతిని చేసి అబార్షన్ ఆరోపణలు
ఖమ్మం, : భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఓ వివాహితను న్యాయం చేస్తానంటూ నమ్మించిన సీఐ ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో మహిళా పోలీస్స్టేషన్లో సీఐగా పనిచేసిన బానోత్ రాజు నాయక్పై కేసు నమోదు చేశారు. భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కరిస్తానంటూ ఆమెకు దగ్గరైన సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో మహిళ గర్భవతి కావడంతో పెళ్లి గురించి ప్రశ్నించగా, బలవంతంగా మాత్రలు మింగించి అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ నెల 7న బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ రాజు నాయక్ను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.
ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి