Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 03:10 PM

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం
19-05-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. గర్భవతిని చేసి అబార్షన్ ఆరోపణలు

ఖమ్మం, : భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను న్యాయం చేస్తానంటూ నమ్మించిన సీఐ ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పనిచేసిన బానోత్ రాజు నాయక్‌పై కేసు నమోదు చేశారు. భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కరిస్తానంటూ ఆమెకు దగ్గరైన సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో మహిళ గర్భవతి కావడంతో పెళ్లి గురించి ప్రశ్నించగా, బలవంతంగా మాత్రలు మింగించి అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నెల 7న బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ రాజు నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.

ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది

Sthanikam

న్యాయం కోసం వెళ్లిన మహిళపై సీఐ దారుణం

Article Image

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. గర్భవతిని చేసి అబార్షన్ ఆరోపణలు

ఖమ్మం, : భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ వివాహితను న్యాయం చేస్తానంటూ నమ్మించిన సీఐ ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐగా పనిచేసిన బానోత్ రాజు నాయక్‌పై కేసు నమోదు చేశారు. భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కరిస్తానంటూ ఆమెకు దగ్గరైన సీఐ ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో మహిళ గర్భవతి కావడంతో పెళ్లి గురించి ప్రశ్నించగా, బలవంతంగా మాత్రలు మింగించి అబార్షన్ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నెల 7న బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సీఐ రాజు నాయక్‌ను హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.

ఘటనపై మరింత విచారణ కొనసాగుతోంది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News