Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 02:13 AM

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య
February 16, 2026 05:29 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు నానాటికి పెరుతున్నాయని,వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం రక్షణ చట్టం వెంటనే తేవాలన్నారు.అత్తాపూర్ లో ఆఫీసులో ఉన్న అడ్వకేట్ మహమ్మద్ ఖాదీర్ ను కొందరు దుండగులు హత్య చేయడాన్ని ఖండిస్తూ కోదాడ కోర్టులో సోమవారం నాడు న్యాయవాదులు తమ విధులు బహిష్కరించారు.ఈ సందర్భంగా ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ మొన్ననే స్వప్న,నేడు ఖాదీర్ దాడుల్లో మరణించారన్నారు.నిత్యం ఎక్కడో ఒక దగ్గర దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఖాదీర్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగుబండి కృష్ణమూర్తి, యడ్లపల్లి వెంకటేశ్వరరావు,కోడూరు వెంకటేశ్వరరావు,రమేష్ బాబు,హుస్సేన్, చలం,కె.మురళి,ధనలక్ష్మి, తమ్మినేని హనుమంతరావు, వి.రంగారావు,రంజాన్ పాషా,పాలేటి నాగేశ్వరరావు, రామిరెడ్డి, గట్ల నర్సింహారావు,రహీం,దావీదు,దొడ్డ శ్రీధర్, బండి వీరభద్రరావు, పాషా,పెద్దబ్బాయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News