Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:47 AM

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య
February 16, 2026 05:29 PM 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య

న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు నానాటికి పెరుతున్నాయని,వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం రక్షణ చట్టం వెంటనే తేవాలన్నారు.అత్తాపూర్ లో ఆఫీసులో ఉన్న అడ్వకేట్ మహమ్మద్ ఖాదీర్ ను కొందరు దుండగులు హత్య చేయడాన్ని ఖండిస్తూ కోదాడ కోర్టులో సోమవారం నాడు న్యాయవాదులు తమ విధులు బహిష్కరించారు.ఈ సందర్భంగా ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ మొన్ననే స్వప్న,నేడు ఖాదీర్ దాడుల్లో మరణించారన్నారు.నిత్యం ఎక్కడో ఒక దగ్గర దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఖాదీర్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగుబండి కృష్ణమూర్తి, యడ్లపల్లి వెంకటేశ్వరరావు,కోడూరు వెంకటేశ్వరరావు,రమేష్ బాబు,హుస్సేన్, చలం,కె.మురళి,ధనలక్ష్మి, తమ్మినేని హనుమంతరావు, వి.రంగారావు,రంజాన్ పాషా,పాలేటి నాగేశ్వరరావు, రామిరెడ్డి, గట్ల నర్సింహారావు,రహీం,దావీదు,దొడ్డ శ్రీధర్, బండి వీరభద్రరావు, పాషా,పెద్దబ్బాయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News