న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య
న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య
Harish HS
న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి...ఉయ్యాల నరసయ్య
న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు నానాటికి పెరుతున్నాయని,వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం రక్షణ చట్టం వెంటనే తేవాలన్నారు.అత్తాపూర్ లో ఆఫీసులో ఉన్న అడ్వకేట్ మహమ్మద్ ఖాదీర్ ను కొందరు దుండగులు హత్య చేయడాన్ని ఖండిస్తూ కోదాడ కోర్టులో సోమవారం నాడు న్యాయవాదులు తమ విధులు బహిష్కరించారు.ఈ సందర్భంగా ఉయ్యాల నర్సయ్య మాట్లాడుతూ మొన్ననే స్వప్న,నేడు ఖాదీర్ దాడుల్లో మరణించారన్నారు.నిత్యం ఎక్కడో ఒక దగ్గర దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఖాదీర్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగుబండి కృష్ణమూర్తి, యడ్లపల్లి వెంకటేశ్వరరావు,కోడూరు వెంకటేశ్వరరావు,రమేష్ బాబు,హుస్సేన్, చలం,కె.మురళి,ధనలక్ష్మి, తమ్మినేని హనుమంతరావు, వి.రంగారావు,రంజాన్ పాషా,పాలేటి నాగేశ్వరరావు, రామిరెడ్డి, గట్ల నర్సింహారావు,రహీం,దావీదు,దొడ్డ శ్రీధర్, బండి వీరభద్రరావు, పాషా,పెద్దబ్బాయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి