Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:04 AM

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి
December 31, 2025 05:23 PM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు శాంతియుతంగా, క్రమశిక్షణతో జరుపుకోవాలని నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. యువత రోడ్లపై అల్లర్లు, ర్యాలీలు, శబ్ద కాలుష్యం కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించడం తప్పనిసరి అన్నారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News