న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి
న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు శాంతియుతంగా, క్రమశిక్షణతో జరుపుకోవాలని నారాయణఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. యువత రోడ్లపై అల్లర్లు, ర్యాలీలు, శబ్ద కాలుష్యం కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ ధరించడం తప్పనిసరి అన్నారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఆనందంగా వేడుకలు జరుపుకోవాలని సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి