Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:37 PM

న్యాల్కల్‌లో టెన్త్ పరీక్షల సందడి… 3 కేంద్రాల్లో 455 మంది విద్యార్థులు

న్యాల్కల్‌లో టెన్త్ పరీక్షల సందడి… 3 కేంద్రాల్లో 455 మంది విద్యార్థులు

న్యాల్కల్‌లో టెన్త్ పరీక్షల సందడి… 3 కేంద్రాల్లో 455 మంది విద్యార్థులు
March 14, 2026 01:01 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు న్యాల్కల్ మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) మారుతి తెలిపారు. మండల పరిధిలోని పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించి మొత్తం మూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల్లో మొత్తం 455 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు.పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, కూర్చునే ఏర్పాట్లు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 45 మంది పర్యవేక్షక సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపడతారని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎంఈవో సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకుని హాల్ టికెట్లు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటికే ముమ్మరంగా సిద్ధమవుతున్నారని, మంచి ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News