Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:32 AM

న్యాల్కల్‌లో రైతులకు 41 రకాల విత్తనాల పంపిణీ

న్యాల్కల్‌లో రైతులకు 41 రకాల విత్తనాల పంపిణీ

న్యాల్కల్‌లో రైతులకు 41 రకాల విత్తనాల పంపిణీ
12-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: మండలంలోని వడ్డి గ్రామంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్) ఆధ్వర్యంలో గురువారం ఫీల్డ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సిఎస్వి 41 రకాల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి అవినాష్ శర్మ మాట్లాడుతూ రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పంటల మార్పిడి విధానాలు, భూసారం పెంపు, మెరుగైన విత్తనాల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు అందిస్తున్న సూచనలను పాటించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మాధవి, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో రైతులకు 41 రకాల విత్తనాల పంపిణీ

Article Image

న్యాల్కల్: మండలంలోని వడ్డి గ్రామంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్) ఆధ్వర్యంలో గురువారం ఫీల్డ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సిఎస్వి 41 రకాల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి అవినాష్ శర్మ మాట్లాడుతూ రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పంటల మార్పిడి విధానాలు, భూసారం పెంపు, మెరుగైన విత్తనాల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు అందిస్తున్న సూచనలను పాటించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మాధవి, స్థానిక రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News