Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

న్యాల్కల్‌లో రైతులకు 41 రకాల విత్తనాల పంపిణీ

న్యాల్కల్‌లో రైతులకు 41 రకాల విత్తనాల పంపిణీ

న్యాల్కల్‌లో రైతులకు 41 రకాల విత్తనాల పంపిణీ
March 12, 2026 10:11 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: మండలంలోని వడ్డి గ్రామంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్) ఆధ్వర్యంలో గురువారం ఫీల్డ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సిఎస్వి 41 రకాల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి అవినాష్ శర్మ మాట్లాడుతూ రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పంటల మార్పిడి విధానాలు, భూసారం పెంపు, మెరుగైన విత్తనాల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు అందిస్తున్న సూచనలను పాటించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మాధవి, స్థానిక రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News