న్యాల్కల్లో ఘనంగా గంధం ఊరేగింపు, భక్తుల వెల్లువ
న్యాల్కల్లో ఘనంగా గంధం ఊరేగింపు, భక్తుల వెల్లువ
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్ నియోజకవర్గం / న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా:
న్యాల్కల్ మండల కేంద్రంలో ఉర్సు సందర్భంగా సోమవారం రాత్రి గంధం ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దర్గా ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపులో అలంకరించిన ఒంటె, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల మోగుడు, నినాదాల మధ్య ఊరేగింపు ప్రధాన వీధుల గుండా సాగడంతో న్యాల్కల్ భక్తిమయంగా మారింది.గంధపు సువాసన, దువాలు, సలాం మధ్య సాగిన ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పతాకాలతో అందంగా అలంకరించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో గంధం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఉర్సు ఉత్సవాలు భక్తుల సందడితో కొనసాగుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి