Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:02 AM

న్యాల్‌కల్‌లో ఘనంగా గంధం ఊరేగింపు, భక్తుల వెల్లువ

న్యాల్‌కల్‌లో ఘనంగా గంధం ఊరేగింపు, భక్తుల వెల్లువ

న్యాల్‌కల్‌లో ఘనంగా గంధం ఊరేగింపు, భక్తుల వెల్లువ
February 03, 2026 08:53 AM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ నియోజకవర్గం / న్యాల్‌కల్, సంగారెడ్డి జిల్లా:

న్యాల్‌కల్ మండల కేంద్రంలో ఉర్సు సందర్భంగా సోమవారం రాత్రి గంధం ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దర్గా ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపులో అలంకరించిన ఒంటె, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల మోగుడు, నినాదాల మధ్య ఊరేగింపు ప్రధాన వీధుల గుండా సాగడంతో న్యాల్‌కల్ భక్తిమయంగా మారింది.గంధపు సువాసన, దువాలు, సలాం మధ్య సాగిన ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పతాకాలతో అందంగా అలంకరించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో గంధం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఉర్సు ఉత్సవాలు భక్తుల సందడితో కొనసాగుతున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News