Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

న్యాల్కల్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

న్యాల్కల్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

న్యాల్కల్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
February 15, 2026 02:55 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

కేతకి సంగమేశ్వరునికి శివమాల భక్తుల పాదయాత్ర

న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే శివభక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చి అభిషేకాలు, రుద్రపఠనాలు చేశారు. దీక్షలు ధరించిన భక్తులు సంప్రదాయ వేషధారణలో దర్శనమిచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం న్యాల్కల్ గ్రామానికి చెందిన శివమాల భక్తులు ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ కేతకి సంగమేశ్వరాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. శివనామస్మరణలతో, భజనలతో సాగిన ఈ యాత్రలో యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్గమధ్యంలో భక్తులకు గ్రామ ప్రజలు నీరు, ప్రసాదం అందించి సేవలందించారు.

కేతకి సంగమేశ్వరాలయానికి పాదయాత్రగా బయలుదేరిన న్యాల్కల్ శివమాల భక్తులు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News