కేతకి సంగమేశ్వరునికి శివమాల భక్తుల పాదయాత్ర
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే శివభక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చి అభిషేకాలు, రుద్రపఠనాలు చేశారు. దీక్షలు ధరించిన భక్తులు సంప్రదాయ వేషధారణలో దర్శనమిచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు.
గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం న్యాల్కల్ గ్రామానికి చెందిన శివమాల భక్తులు ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ కేతకి సంగమేశ్వరాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. శివనామస్మరణలతో, భజనలతో సాగిన ఈ యాత్రలో యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్గమధ్యంలో భక్తులకు గ్రామ ప్రజలు నీరు, ప్రసాదం అందించి సేవలందించారు.
కేతకి సంగమేశ్వరాలయానికి పాదయాత్రగా బయలుదేరిన న్యాల్కల్ శివమాల భక్తులు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి