Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:37 PM

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు
March 16, 2026 08:18 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని చనిగేపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు మరియు వడగండ్ల వానతో గ్రామంలో బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాలుల తీవ్రతకు పలు చెట్లు విరిగి రహదారులపై పడిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అదే సమయంలో గ్రామంలోని కొన్ని విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చెట్లు మరియు విద్యుత్ తీగలు రహదారిపై పడిపోవడంతో గ్రామ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు ప్రారంభించారు.విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గాలివాన కారణంగా గ్రామంలో కొన్ని చోట్ల చిన్నపాటి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News