Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:36 AM

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు
16-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని చనిగేపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు మరియు వడగండ్ల వానతో గ్రామంలో బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాలుల తీవ్రతకు పలు చెట్లు విరిగి రహదారులపై పడిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అదే సమయంలో గ్రామంలోని కొన్ని విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చెట్లు మరియు విద్యుత్ తీగలు రహదారిపై పడిపోవడంతో గ్రామ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు ప్రారంభించారు.విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గాలివాన కారణంగా గ్రామంలో కొన్ని చోట్ల చిన్నపాటి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని చనిగేపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు మరియు వడగండ్ల వానతో గ్రామంలో బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాలుల తీవ్రతకు పలు చెట్లు విరిగి రహదారులపై పడిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అదే సమయంలో గ్రామంలోని కొన్ని విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చెట్లు మరియు విద్యుత్ తీగలు రహదారిపై పడిపోవడంతో గ్రామ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు ప్రారంభించారు.విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గాలివాన కారణంగా గ్రామంలో కొన్ని చోట్ల చిన్నపాటి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News