Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:33 AM

న్యాల్కల్: వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి ఘనంగా నిర్వహణ

న్యాల్కల్: వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి ఘనంగా నిర్వహణ

న్యాల్కల్: వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి ఘనంగా నిర్వహణ
01-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మడివాళ మాచిదేవ’రు విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్ పాల్గొన్నారు. అలాగే హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, సున్నపు సత్యనారాయణ, సాయి, వెంకట్, ముజఫర్ పటేల్, ప్రీతిష్, ఇసాం పటేల్ తదితరులు హాజరై మడివాళ మాచిదేవ’రు విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మడివాళ మాచిదేవ’రు సమాజానికి అందించిన సేవలు, త్యాగాలు అనన్యసామాన్యమని పేర్కొన్నారు. ఆయన బోధనలు నేటి తరానికి మార్గదర్శకమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రాంతం

న్యాల్కల్ గ్రామం,

న్యాల్కల్ మండలం,

సంగారెడ్డి జిల్లా

Sthanikam

న్యాల్కల్: వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి ఘనంగా నిర్వహణ

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మడివాళ మాచిదేవ’రు విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్ పాల్గొన్నారు. అలాగే హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, సున్నపు సత్యనారాయణ, సాయి, వెంకట్, ముజఫర్ పటేల్, ప్రీతిష్, ఇసాం పటేల్ తదితరులు హాజరై మడివాళ మాచిదేవ’రు విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మడివాళ మాచిదేవ’రు సమాజానికి అందించిన సేవలు, త్యాగాలు అనన్యసామాన్యమని పేర్కొన్నారు. ఆయన బోధనలు నేటి తరానికి మార్గదర్శకమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రాంతం

న్యాల్కల్ గ్రామం,

న్యాల్కల్ మండలం,

సంగారెడ్డి జిల్లా

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News