న్యాల్కల్: వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి ఘనంగా నిర్వహణ
న్యాల్కల్: వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి ఘనంగా నిర్వహణ
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మడివాళ మాచిదేవ’రు విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్ పాల్గొన్నారు. అలాగే హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, సున్నపు సత్యనారాయణ, సాయి, వెంకట్, ముజఫర్ పటేల్, ప్రీతిష్, ఇసాం పటేల్ తదితరులు హాజరై మడివాళ మాచిదేవ’రు విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మడివాళ మాచిదేవ’రు సమాజానికి అందించిన సేవలు, త్యాగాలు అనన్యసామాన్యమని పేర్కొన్నారు. ఆయన బోధనలు నేటి తరానికి మార్గదర్శకమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రాంతం
న్యాల్కల్ గ్రామం,
న్యాల్కల్ మండలం,
సంగారెడ్డి జిల్లా

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి