Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:14 PM

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ
February 01, 2026 12:00 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా :

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారంరోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లా తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పశువులు తరలివచ్చాయి. రైతులు కొనుగోలు–అమ్మకాలతో బిజీగా ఉండగా, కోట్ల రూపాయల విలువైన వ్యాపారం కొనసాగింది.

ఈ సందర్భంగా మేలైన పశువులను ఎంపిక చేసి, న్యాల్కల్ గ్రామానికి చెందిన శిల్పకళాకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ తన తల్లిదండ్రులు, అన్న కుమారుడి జ్ఞాపకార్థంగా రైతులకు బసవ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రైతులు, పశుపోషకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర సందర్భంగా నిర్వహించిన పశువుల జాతరలో పాల్గొన్న రైతులు, పశువులు.

ప్రాంతం : న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా

రిపోర్టర్ : సంగమేశ్వర్ రెడ్డి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News