న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ
న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా :
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారంరోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లా తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పశువులు తరలివచ్చాయి. రైతులు కొనుగోలు–అమ్మకాలతో బిజీగా ఉండగా, కోట్ల రూపాయల విలువైన వ్యాపారం కొనసాగింది.
ఈ సందర్భంగా మేలైన పశువులను ఎంపిక చేసి, న్యాల్కల్ గ్రామానికి చెందిన శిల్పకళాకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ తన తల్లిదండ్రులు, అన్న కుమారుడి జ్ఞాపకార్థంగా రైతులకు బసవ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రైతులు, పశుపోషకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర సందర్భంగా నిర్వహించిన పశువుల జాతరలో పాల్గొన్న రైతులు, పశువులు.
ప్రాంతం : న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా
రిపోర్టర్ : సంగమేశ్వర్ రెడ్డి

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి