Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:48 PM

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ
February 01, 2026 12:00 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా :

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారంరోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లా తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పశువులు తరలివచ్చాయి. రైతులు కొనుగోలు–అమ్మకాలతో బిజీగా ఉండగా, కోట్ల రూపాయల విలువైన వ్యాపారం కొనసాగింది.

ఈ సందర్భంగా మేలైన పశువులను ఎంపిక చేసి, న్యాల్కల్ గ్రామానికి చెందిన శిల్పకళాకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ తన తల్లిదండ్రులు, అన్న కుమారుడి జ్ఞాపకార్థంగా రైతులకు బసవ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రైతులు, పశుపోషకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర సందర్భంగా నిర్వహించిన పశువుల జాతరలో పాల్గొన్న రైతులు, పశువులు.

ప్రాంతం : న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా

రిపోర్టర్ : సంగమేశ్వర్ రెడ్డి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News