Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:10 AM

న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 400 ఎర్రరాళ్లతో లారీ స్వాధీనం

న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 400 ఎర్రరాళ్లతో లారీ స్వాధీనం

న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 400 ఎర్రరాళ్లతో లారీ స్వాధీనం
29-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాను హద్నూర్ పోలీసులు భగ్నం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణలోకి ఎర్రరాళ్లను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

న్యాల్కల్ తండా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన లారీని అడ్డగించి తనిఖీ చేయగా, సుమారు 400 ఎర్రరాళ్లు ఉన్నట్లు గుర్తించారు. రవాణాకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు, అనుమతులు లేకపోవడంతో లారీని వెంటనే స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాథోడ్ శ్రావణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అక్రమ ఖనిజ రవాణా, సహజ వనరుల దోపిడీకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ హెచ్చరించారు.

హద్నూర్ పోలీసుల వేగవంతమైన చర్యతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రరాళ్లు పట్టుబడగా, ఈ ఘటన అక్రమ ఖనిజ రవాణాదారులకు గట్టిగా హెచ్చరించారు.

Sthanikam

న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 400 ఎర్రరాళ్లతో లారీ స్వాధీనం

Article Image

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాను హద్నూర్ పోలీసులు భగ్నం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణలోకి ఎర్రరాళ్లను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

న్యాల్కల్ తండా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన లారీని అడ్డగించి తనిఖీ చేయగా, సుమారు 400 ఎర్రరాళ్లు ఉన్నట్లు గుర్తించారు. రవాణాకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు, అనుమతులు లేకపోవడంతో లారీని వెంటనే స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాథోడ్ శ్రావణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అక్రమ ఖనిజ రవాణా, సహజ వనరుల దోపిడీకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ హెచ్చరించారు.

హద్నూర్ పోలీసుల వేగవంతమైన చర్యతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రరాళ్లు పట్టుబడగా, ఈ ఘటన అక్రమ ఖనిజ రవాణాదారులకు గట్టిగా హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News