న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 400 ఎర్రరాళ్లతో లారీ స్వాధీనం
న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 400 ఎర్రరాళ్లతో లారీ స్వాధీనం
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్ నియోజకవర్గం
న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాను హద్నూర్ పోలీసులు భగ్నం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణలోకి ఎర్రరాళ్లను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
న్యాల్కల్ తండా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన లారీని అడ్డగించి తనిఖీ చేయగా, సుమారు 400 ఎర్రరాళ్లు ఉన్నట్లు గుర్తించారు. రవాణాకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు, అనుమతులు లేకపోవడంతో లారీని వెంటనే స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాథోడ్ శ్రావణ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అక్రమ ఖనిజ రవాణా, సహజ వనరుల దోపిడీకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ హెచ్చరించారు.
హద్నూర్ పోలీసుల వేగవంతమైన చర్యతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రరాళ్లు పట్టుబడగా, ఈ ఘటన అక్రమ ఖనిజ రవాణాదారులకు గట్టిగా హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి