న్యాల్కల్, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత
న్యాల్కల్, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనార్థం తాత్కాలికంగా మూసివేయబడనుంది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రధాన ఆలయం తో పాటు ఉప ఆలయాల ద్వారాలు మూసివేయబడతాయని ఆలయ అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా కనిపించని విధంగా స్వయంభువుగా వెలిసిన లింగాకారంలో స్వామివారు దర్శనమివ్వడం ఈ ఆలయానికి విశిష్ట గుర్తింపుగా నిలిచింది. అనాదికాలం నుంచి పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం ప్రాంతీయంగా ప్రసిద్ధి చెందడంతో పాటు మహాశివరాత్రి, కార్తీకమాసం, ప్రతి సోమవారం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
గ్రహణం ముగిసిన అనంతరం రాత్రి 7:45 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి పునఃప్రతిష్ఠ అనంతరం మంగళహారతులు ఇచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొంటారని తెలిపారు. భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి