Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:25 AM

న్యాల్కల్, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత

న్యాల్కల్, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత

న్యాల్కల్,  శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత
02-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనార్థం తాత్కాలికంగా మూసివేయబడనుంది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రధాన ఆలయం తో పాటు ఉప ఆలయాల ద్వారాలు మూసివేయబడతాయని ఆలయ అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా కనిపించని విధంగా స్వయంభువుగా వెలిసిన లింగాకారంలో స్వామివారు దర్శనమివ్వడం ఈ ఆలయానికి విశిష్ట గుర్తింపుగా నిలిచింది. అనాదికాలం నుంచి పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం ప్రాంతీయంగా ప్రసిద్ధి చెందడంతో పాటు మహాశివరాత్రి, కార్తీకమాసం, ప్రతి సోమవారం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

గ్రహణం ముగిసిన అనంతరం రాత్రి 7:45 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి పునఃప్రతిష్ఠ అనంతరం మంగళహారతులు ఇచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొంటారని తెలిపారు. భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.


Sthanikam

న్యాల్కల్, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనార్థం తాత్కాలికంగా మూసివేయబడనుంది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రధాన ఆలయం తో పాటు ఉప ఆలయాల ద్వారాలు మూసివేయబడతాయని ఆలయ అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా కనిపించని విధంగా స్వయంభువుగా వెలిసిన లింగాకారంలో స్వామివారు దర్శనమివ్వడం ఈ ఆలయానికి విశిష్ట గుర్తింపుగా నిలిచింది. అనాదికాలం నుంచి పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం ప్రాంతీయంగా ప్రసిద్ధి చెందడంతో పాటు మహాశివరాత్రి, కార్తీకమాసం, ప్రతి సోమవారం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

గ్రహణం ముగిసిన అనంతరం రాత్రి 7:45 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి పునఃప్రతిష్ఠ అనంతరం మంగళహారతులు ఇచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొంటారని తెలిపారు. భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News