న్యాల్కల్ మండలం రామతీర్థలో మడివాళ మాచిదేవ’రు జయంతి – విశేష పూజలు
న్యాల్కల్ మండలం రామతీర్థలో మడివాళ మాచిదేవ’రు జయంతి – విశేష పూజలు
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రామతీర్థ గ్రామంలో వీరగణాచార్య మడివాళ మాచిదేవ’రు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన మడివాళ మాచిదేవ’రు చిత్రపటానికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మడివాళ మాచిదేవ’రు సమాజానికి అందించిన సేవలు, ఆశయాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
కార్యక్రమంలో రామతీర్థ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉప సర్పంచ్ శ్రీకాంత్, ప్రతాప్ రెడ్డి, మొగులప్ప, ప్రభాకర్, రాజు పాల్గొని మాచిదేవ’రు ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యత, శాంతి, సేవాభావాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రాంతం: రామతీర్థ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా
Reporter: సంగమేశ్వర్ రెడ్డి

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి