న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు జోరు.. కేంద్రాలకు పోటెత్తుతున్న రైతులు
న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు జోరు.. కేంద్రాలకు పోటెత్తుతున్న రైతులు
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్ నియోజకవర్గం
న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలకు రైతులు పెద్ద ఎత్తున జొన్నలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. న్యాల్కల్ డీసీఎంఎస్, హద్నూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజూ వందలాది క్వింటాళ్ల జొన్నలు సేకరించబడుతున్నాయి.
మండలంలోని పలు గ్రామాల రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, ధాన్యాన్ని వేగంగా సేకరిస్తున్నారు. దీంతో రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు న్యాల్కల్ డీసీఎంఎస్లో 3,242 క్వింటాళ్లు, హద్నూర్ పీఏసీఎస్లో 2,300 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు ఆయా సంస్థల చైర్మన్లు సిద్ధి లింగయ్యస్వామి, జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కల్పించిన కొనుగోలు సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.
మంచి దిగుబడులు రావడంతో పాటు ప్రభుత్వ కొనుగోళ్లు వేగంగా కొనసాగుతుండటంతో మండల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో కొనుగోళ్ల పరిమాణం మరింత పెరిగే అవకాశాలు ఉందని అధికారులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి