Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 01:02 AM

న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు జోరు.. కేంద్రాలకు పోటెత్తుతున్న రైతులు

న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు జోరు.. కేంద్రాలకు పోటెత్తుతున్న రైతులు

న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు జోరు.. కేంద్రాలకు పోటెత్తుతున్న రైతులు
May 29, 2026 07:54 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలకు రైతులు పెద్ద ఎత్తున జొన్నలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. న్యాల్కల్ డీసీఎంఎస్, హద్నూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజూ వందలాది క్వింటాళ్ల జొన్నలు సేకరించబడుతున్నాయి.

మండలంలోని పలు గ్రామాల రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, ధాన్యాన్ని వేగంగా సేకరిస్తున్నారు. దీంతో రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు న్యాల్కల్ డీసీఎంఎస్‌లో 3,242 క్వింటాళ్లు, హద్నూర్ పీఏసీఎస్‌లో 2,300 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు ఆయా సంస్థల చైర్మన్లు సిద్ధి లింగయ్యస్వామి, జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కల్పించిన కొనుగోలు సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.

మంచి దిగుబడులు రావడంతో పాటు ప్రభుత్వ కొనుగోళ్లు వేగంగా కొనసాగుతుండటంతో మండల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో కొనుగోళ్ల పరిమాణం మరింత పెరిగే అవకాశాలు ఉందని అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News