న్యాల్కల్ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు
న్యాల్కల్ కు కొత్త గుర్తింపు.. స్వాగత బోర్డు ఏర్పాటు
Reporter Sangameshwar Reddy
గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్ చొరవతో ఏర్పాటు
జహీరాబాద్ నియోజకవర్గం
న్యాల్కల్, గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో న్యాల్కల్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సరిహద్దులో స్వాగత బోర్డును శుక్రవారం ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చే ప్రజలకు న్యాల్కల్ ప్రత్యేకతను చాటిచెప్పేలా ఈ బోర్డు ఏర్పాటు చేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి - ప్రవీణ్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, పరిశుభ్రతతో పాటు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ స్వాగత బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ బోర్డు న్యాల్కల్ గ్రామ ప్రతిష్ఠను మరింత పెంచడమే కాకుండా, గ్రామ అభివృద్ధికి ప్రతీకగా నిలవనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి