Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 02:29 PM

న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీల్లో హైదరాబాద్ మల్లయోధుడి ఘన విజయం

న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీల్లో హైదరాబాద్ మల్లయోధుడి ఘన విజయం

న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీల్లో హైదరాబాద్ మల్లయోధుడి ఘన విజయం
04-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రం న్యాల్కల్ గ్రామ శివారులోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. మహారాష్ట్ర–హైదరాబాద్ మల్లయోధుల మధ్య జరిగిన కీలక పోటీలో హైదరాబాద్‌కు చెందిన కుశాల్ ఘన విజయం సాధించారు.విజేతగా నిలిచిన కుశాల్‌కు నిర్వాహకులు రూ.25,000 నగదు బహుమానం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దల సమక్షంలో జాతర ప్రాంగణంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది. పోటీలు యువత కేరింతలు, ఈలల నడుమ ‘నువ్వా నేనా’ అన్నట్టుగా సాగి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్, హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, న్యాల్కల్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు సున్నపు సత్యనారాయణ, ఇసాం పటేల్, న్యాల్కల్ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, విట్టల్ రెడ్డి పటేల్ తదితరులు పాల్గొన్నారు.జాతర సందర్భంగా నిర్వహించిన ఈ కుస్తీ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుని న్యాల్కల్ జాతర వైభవాన్ని మరింత పెంచాయని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీల్లో హైదరాబాద్ మల్లయోధుడి ఘన విజయం

Article Image

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రం న్యాల్కల్ గ్రామ శివారులోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. మహారాష్ట్ర–హైదరాబాద్ మల్లయోధుల మధ్య జరిగిన కీలక పోటీలో హైదరాబాద్‌కు చెందిన కుశాల్ ఘన విజయం సాధించారు.విజేతగా నిలిచిన కుశాల్‌కు నిర్వాహకులు రూ.25,000 నగదు బహుమానం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దల సమక్షంలో జాతర ప్రాంగణంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది. పోటీలు యువత కేరింతలు, ఈలల నడుమ ‘నువ్వా నేనా’ అన్నట్టుగా సాగి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్, హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, న్యాల్కల్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు సున్నపు సత్యనారాయణ, ఇసాం పటేల్, న్యాల్కల్ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, విట్టల్ రెడ్డి పటేల్ తదితరులు పాల్గొన్నారు.జాతర సందర్భంగా నిర్వహించిన ఈ కుస్తీ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుని న్యాల్కల్ జాతర వైభవాన్ని మరింత పెంచాయని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News