న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీల్లో హైదరాబాద్ మల్లయోధుడి ఘన విజయం
న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీల్లో హైదరాబాద్ మల్లయోధుడి ఘన విజయం
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్,
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రం న్యాల్కల్ గ్రామ శివారులోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. మహారాష్ట్ర–హైదరాబాద్ మల్లయోధుల మధ్య జరిగిన కీలక పోటీలో హైదరాబాద్కు చెందిన కుశాల్ ఘన విజయం సాధించారు.విజేతగా నిలిచిన కుశాల్కు నిర్వాహకులు రూ.25,000 నగదు బహుమానం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దల సమక్షంలో జాతర ప్రాంగణంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది. పోటీలు యువత కేరింతలు, ఈలల నడుమ ‘నువ్వా నేనా’ అన్నట్టుగా సాగి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్, హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, న్యాల్కల్ బీఆర్ఎస్ అధ్యక్షులు సున్నపు సత్యనారాయణ, ఇసాం పటేల్, న్యాల్కల్ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, విట్టల్ రెడ్డి పటేల్ తదితరులు పాల్గొన్నారు.జాతర సందర్భంగా నిర్వహించిన ఈ కుస్తీ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుని న్యాల్కల్ జాతర వైభవాన్ని మరింత పెంచాయని నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి