Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

న్యాల్కల్ గ్రామంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం

న్యాల్కల్ గ్రామంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం

న్యాల్కల్ గ్రామంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం
March 10, 2026 09:22 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యాచరణ ప్రణాళిక మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగనుంది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, రహదారుల పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచడం ప్రతి గ్రామస్థుడి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి – ప్రవీణ్ కుమార్, సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ది లింగయ్య స్వామి, అంజి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, అలాగే గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News