PRINT TIME: May 26, 2026 05:48 PM
న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు
న్యాల్కల్ దర్గా ఉర్సు జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు
February 04, 2026 04:35 PM
12 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్ / సంగారెడ్డి జిల్లా:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని హజ్రత్ పీరైబ్ సాహెబ్ దర్గా వద్ద జరుగుతున్న ఉర్సు జాతర సందర్భంగా బుధవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లాలోని పలు గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పీరైబ్ సాహెబ్కు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.జాతర సందర్భంగా దువ్వా, నియాజ్, మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సైతం హాజరై జాతర వాతావరణాన్ని భక్తిశ్రద్ధలతో నింపారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి