Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:03 PM

నాయకన్ గూడెంలో నూతన వేడుకల మందిరం ప్రారంభం

నాయకన్ గూడెంలో నూతన వేడుకల మందిరం ప్రారంభం

నాయకన్ గూడెంలో నూతన వేడుకల మందిరం ప్రారంభం
27-02-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చేతుల మీదుగా శుభారంభం – గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం హామీ

కుసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి వీరన్న నిర్మించిన నూతన ‘పీవీ (పవన్) వేడుకల మందిరం’ను రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి మందిరాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వసతులు కల్పించడం ద్వారా సామాజిక కార్యక్రమాలు సులభతరం అవుతాయని అన్నారు. వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఈ మందిరం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపూడి వీరన్న, సూర్య కళ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచరి సైదమ్మ కొండల్, ఉపసర్పంచ్ భీష్మాచారి, మండల నాయకులు బజ్జురి వెంకటరెడ్డి, కొమురెల్లి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచర్ల సుధీర్ రెడ్డి, నాయకులు కంచర్ల వీరారెడ్డి, కంచర్ల పవన్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఎండి జహంగీర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నాయకన్ గూడెంలో నూతన వేడుకల మందిరం ప్రారంభం

Article Image

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చేతుల మీదుగా శుభారంభం – గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం హామీ

కుసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి వీరన్న నిర్మించిన నూతన ‘పీవీ (పవన్) వేడుకల మందిరం’ను రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి మందిరాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వసతులు కల్పించడం ద్వారా సామాజిక కార్యక్రమాలు సులభతరం అవుతాయని అన్నారు. వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఈ మందిరం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపూడి వీరన్న, సూర్య కళ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచరి సైదమ్మ కొండల్, ఉపసర్పంచ్ భీష్మాచారి, మండల నాయకులు బజ్జురి వెంకటరెడ్డి, కొమురెల్లి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచర్ల సుధీర్ రెడ్డి, నాయకులు కంచర్ల వీరారెడ్డి, కంచర్ల పవన్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఎండి జహంగీర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News