Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 27, 2026 07:02 PM

నాయకన్ గూడెంలో నూతన వేడుకల మందిరం ప్రారంభం

నాయకన్ గూడెంలో నూతన వేడుకల మందిరం ప్రారంభం

నాయకన్ గూడెంలో నూతన వేడుకల మందిరం ప్రారంభం
February 27, 2026 05:37 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చేతుల మీదుగా శుభారంభం – గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం హామీ

కుసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి వీరన్న నిర్మించిన నూతన ‘పీవీ (పవన్) వేడుకల మందిరం’ను రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం రిబ్బన్ కట్ చేసి మందిరాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి వసతులు కల్పించడం ద్వారా సామాజిక కార్యక్రమాలు సులభతరం అవుతాయని అన్నారు. వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఈ మందిరం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపూడి వీరన్న, సూర్య కళ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఎంపీని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచరి సైదమ్మ కొండల్, ఉపసర్పంచ్ భీష్మాచారి, మండల నాయకులు బజ్జురి వెంకటరెడ్డి, కొమురెల్లి లింగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కంచర్ల సుధీర్ రెడ్డి, నాయకులు కంచర్ల వీరారెడ్డి, కంచర్ల పవన్ రెడ్డి, మైనారిటీ నాయకులు ఎండి జహంగీర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News