Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:44 PM

న్యాలకల్‌లో కాంగ్రెస్ పార్టీ కొత్త సర్పంచుల & ఉప-సర్పంచుల సన్మాన సభ

న్యాలకల్‌లో కాంగ్రెస్ పార్టీ కొత్త సర్పంచుల & ఉప-సర్పంచుల సన్మాన సభ

న్యాలకల్‌లో కాంగ్రెస్ పార్టీ కొత్త సర్పంచుల & ఉప-సర్పంచుల సన్మాన సభ
January 04, 2026 07:41 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:న్యాలకల్/ముంగి చౌరస్తా SRK ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప-సర్పంచుల సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ ఇంచార్జ్ డా. ఏ.చంద్రశేఖర్ పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అందించడం, గ్రామ ప్రజలకు వాగ్దానాలు నెరవేర్చడంలో నూతన సర్పంచులు పూర్తి బాధ్యత వహించాలని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్,డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే మీ ముందు ఉంటాను. ఎవరూ అధైర్యపడవద్దు, ఎవరికీ భయం ఉండాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. ప్రతి సర్పంచ్ మరియు ఉప-సర్పంచ్ సమాజానికి సమగ్ర సేవ అందించడానికి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ రామలింగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాక్సూద్ అహ్మద్, నరసింహా రెడ్డి, జహీరాబాద్ పట్టణ అధ్యక్షుడు కండేం నర్సింలు, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, ఏ.యమ్.సి వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్, సామెల్, కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, PACS ఛైర్మన్ సిద్దిలింగయ్య స్వామి, మాజీ ఎంపీటీసీ అశోక్, రాష్ట్ర మాజీ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు రాంమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు హెగ్గేల్లి రాములు, శుక్లవర్ధన్ రెడ్డి, జేజే జావీద్, ఖాజా, మొయిజ్, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం ద్వారా కొత్త సర్పంచులు ప్రజల సమస్యలను తీర్చడంలో, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడంలో పూర్తి బాధ్యత వహించేందుకు ఉత్సాహంగా ఉన్నారని స్పష్టమైంది. ఈ సభ స్థానిక రాజకీయాలలో గ్రామస్థాయి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ, ప్రజల కోసం సమగ్ర సేవ అందించే దిశగా మైలురాయిగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News